KRNL: రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు రెండో విడతలో జిల్లాకు చేరాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి 8,309 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 7,921 భూ యజమానులకు ఇప్పటికే పంపిణీ చేశారు. మార్చి నెలకు చెందిన 8,866 పాసుపుస్తకాలు జిల్లాకు చేరగా, మండలాల వారీగా అధికారులు స్వీకరించారు. పరిశీలన అనంతరం రేపు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.