E.G: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.