SKLM: మందస మేజర్ పంచాయితీ కరణం వీధి ప్రజలకు శుద్ధ జలం పంపిణీ కాక అవస్థలు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మేరకు శుక్రవారం సర్పంచ్ ప్రతినిధి సిహెచ్ లక్ష్మణమూర్తికు వినతి పత్రం అందజేశారు. చాలా కాలం నుండి కరణం వీధి ప్రజలకు శుద్ధ జలం పంపిణీ జరగడం లేదని, పలుమార్లు సమస్యను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ చర్యలు శూన్యమని వాపోయారు.