KRNL: విద్యుత్ బిల్లుల పేరుతో వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని ఫేక్ మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని, విద్యుత్ సేవల సమాచారం అధికారిక మార్గాల్లోనే అందుతుందని పేర్కొన్నారు.