SKLM: వేసవి కాలంలో గొర్రెలు, మేకలు వంటి పశువుల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోతే మూగజీవాలు మరణించే ప్రమాదం ఉందని పశుసంవర్ధక శాఖ ఏడి జి. నారాయణరావు అన్నారు. ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాలను శనివారం సందర్శించి పాడి రైతులతో మాట్లాడారు. వేసవిలో పశువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.