ELR: టి.నరసాపురం మండలం శ్రీరామవరంలో సోమవారం పోలీసులు పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండల పరిధిలో జూదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.