PLD: అమరావతి మండలంలోని దిడుగు గ్రామం నుంచి ఏటూరు వెళ్లే మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. ఈ విషయంపై ఏప్రిల్ 14న HIT TVలో కథనం ప్రచూరితమైంది. స్పందించిన అధికారులు పంచాయతీ అధికారుల సమక్షంలో రోడ్డు మధ్యలో తీసిన గండిని పూడ్చివేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లంక భూముల్లో గండ్లు కొడితే చర్యలు తీసుకుంటామని MPDO హెచ్చరించారు.