SKLM: వజ్రపుకొత్తూరు మండలం సీతంపేటలో జల జీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు పనులను ప్రారంభించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఇందులో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ పాల్గొన్నారు.