KRNL: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు బంగారం భవిష్యత్తు ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారిని లలితా వరలక్ష్మి అన్నారు. శనివారం ఉద్యాన సమావేశ మందిరంలో డీపీఎం మాధురి యాదవ్ కలిసి ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులందరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు.