E.G: జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో జేసీ మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ జరగనుందన్నారు.