అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 55 వేల ఉద్యోగాలు కలుగుతాయని తెలిపారు. ఈ నెల 23న శంకుస్థాపన జరగనుండగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.