విశాఖలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో జరిగిన 84వ రోజు కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని కోరారు. జాబ్ కేలండర్లో విద్యుత్ శాఖ ఏఈఈ, జెఎల్ఎం పోస్టులు చేర్చాలని అభ్యర్థులు విన్నవించారు.