ATP: ఆత్మకూరు మండలం వడ్డిపల్లిలో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ విరమణ సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం రాప్తాడులో రాక్షస పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పేరూరు డ్యాంకు నీరు అందించి రైతులను ఆదుకున్నామని, MLA సునీత మాత్రం నియోజకవర్గానికి కరువును కానుకగా ఇచ్చారని విమర్శించారు.