ప్రకాశం: రెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), ప్రధాన మంత్రి పంట బీమా పథకం (PMFBY), వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (RWBCIS), కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పథకాల గురించి రైతులకు సమగ్రంగా వివరించారు.