NDL: నందికొట్కూరు సమీపంలోని ముచుమర్రి వద్ద ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణానది నీటిమట్టం తగ్గడంతో మళ్లీ బయటపడింది. గత కొన్ని నెలలుగా శ్రీశైలం జలాశయం నీటితో మునిగిపోయిన ఈ ఆలయం, నీరు తగ్గడంతో భక్తులకు దర్శనమిస్తోంది. 7 నదులు సంగమించే పవిత్ర స్థలంలో ఉన్న ఈ ఆలయం ప్రతి సంవత్సరం నీటిలో మునిగి, తిరిగి బయటపడటం విశేషం.