సత్యసాయి: ఉదయగిరిలోని MPDO నూతన భవనం సోమవారం ఉదయం 10 గంటలకు పునః ప్రారంభిస్తున్నట్లు MPP మూలే పద్మజ వినయ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. జడ్పీ, మండల నిధులతో పాటు MPP సొంత నిధులతో ఈ భవన నిర్మాణం నూతన హంగులతో ఏర్పాటు చేశారు.