BPT: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28న చీరాలకు విచ్చేయనున్నట్లు సమాచారం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనపై సీఎంఓ అధికారులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపినట్లు సమాచారం. తక్కువ వ్యవధి ఉండటంతో ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎం చీరాల సముద్ర తీరాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.