SKLM: శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు .సాయి కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు.15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500 పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.