ATP: రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు ఈ పదవి దక్కడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.