KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని DSP భార్గవి ఇవాళ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆటోలను వరుస క్రమంలో నిలబెట్టి నడుపుకోవాలని, దీనిపై గొడవలకు దిగవద్దని సూచించారు. పట్టణంలో బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కన బడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.