NTR: నందిగామలో డ్రగ్స్ పై అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 30వ రోజుకు చేరిన ఈ ర్యాలీ జాతరను తలపించింది. డీజే సౌండ్స్తో సాగిన ర్యాలీలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.