NLR: ఉదయగిరిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి జరిగింది. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళులర్పించారు. దళిత నాయకుడిగా, భారత ఉప ప్రధానిగా ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.