NLR: ఇందుకూరుపేట మండలం పరిధి మైపాడు బీచ్ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచే మట్టిని లారీలు, హిటాచీలతో లే-అవుట్లకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో సిబ్బందిని పంపించి విచారణ చేపడతామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.