AKP: పరవాడ, లంకెలపాలెం మీదుగా బొగ్గు లారీల రవాణాను నిలిపివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడ జంక్షన్లో ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. బొగ్గు లోడుతో రాకపోకలు సాగించే లారీలు నుంచి బొగ్గు రోడ్లపై పడుతుండడంతో ప్రజలు పలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.