అనంతపురం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల అర్హత ఎంపిక శిబిరం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి మూడు చక్రాల పెట్రోల్ వాహనం కోసం దరఖాస్తు చేసుకున్న 132 మందిని అధికారులు పరిశీలించారు.