ఏలూరు: నగరంలోని డివిజన్ 27, 28లలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శనివారం తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గోడౌన్స్ సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల వద్ద ఉన్న ఈ- వేస్ట్ ను అందజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.