విశాఖ: బడేవలస-కొంపంగి రహదారిలో గోపీనాథ్ పట్నాయక్ చెరువు వద్ద రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. ఈ మార్గంలో రోజూ భారీగా వాహన రాకపోకలు జరుగుతున్నప్పటికీ, రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాల భయం నెలకొంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.