KDP: దొడియం నుంచి తలమంచిపట్నం వెళ్లే రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్ పైపొర ఊడిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గాలి ఫ్యాన్ ప్రాంతానికి వెళ్లే భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్ పై పొర ఊడిపోవడంతో రాళ్లు బయటకు వచ్చాయి.