కృష్ణా: పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను విద్యార్థులతో భట్టీ పట్టించవద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మోపిదేవి మండలం వెంకటాపురం ఎంపీపీ స్కూలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పఠన సామర్థ్యం పరిశీలించగా, విద్యార్థులు చూసి చదవటాన్ని గమనించి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.