VSP: 2025-26 ఆర్థిక సంవత్సరంలో విశాఖ, విజయవాడ రైల్వే డివిజన్లు తమ పనితీరుతో ఆకట్టుకున్నాయి. సరుకు రవాణాలో విశాఖ డివిజన్ 85.10 మిలియన్ టన్నులతో ముందంజలో నిలిచింది. స్థూల ఆదాయంలో కూడా రూ.10,422 కోట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు విజయవాడ డివిజన్ 40.63 మిలియన్ టన్నుల సరుకు రవాణా, రూ.5,907 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.