CTR: కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన 1,386 మంది రైతులందరికీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని సూచించారు. రైతులకు మైక్రో ఇరిగేషన్ పథకం ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.