NDL: ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్సై వరప్రసాద్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహానీయుడని తెలిపారు.