GNTR: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖల అభివృద్ధి నివేదికలను అసెంబ్లీలో విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పురోగతిని వివరిస్తూ, తెనాలి నియోజకవర్గ అభివృద్ధి నివేదికను మంత్రి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. గత రెండేళ్లలో చేపట్టిన పనులు, పథకాల సమగ్ర వివరాలు ఈ నివేదికలో పొందుపరిచినట్లు వారు పేర్కొన్నారు.