AKP: సబ్బవరం మండల కేంద్రంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించే రోజు వచ్చినప్పుడే అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.