PPM: వీరఘట్టం ప్రాంతానికి చెందిన భోగి శ్రీధర్, సుజాత దంపతుల కుమారుడు శ్రీకర్ జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాల్లో 99.59 స్కోర్ సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 6571వ ర్యాంక్ ఈబీసీ విభాగంలో 777వ ర్యాంక్ పొందాడు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా, గ్రామస్థులు శ్రీకర్ ను అభినందించారు.