PLD: జిల్లాలో ప్రతి అర్హుడైన రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.