PLD: చిలకలూరిపేట సమీపంలోని గణపవరం పారిశ్రామిక వాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన నిదానిధర్ దాస్ (46) అనే కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంతో కలిసి వలస వచ్చి గణపవరంలో నివాసం ఉంటూ.. పరిశ్రమల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.