కృష్ణా: విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్లే రైలులో మహాలక్ష్మి అనే ప్రయాణికురాలు తన హ్యాండ్ బ్యాగ్ను భీమవరం రైల్వే స్టేషన్లో నిన్న మర్చిపోయారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ వెంటనే అప్రమత్తమై హ్యాండ్ బ్యాగులో ఉన్న 110 బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, రూ.5000 నగదు బాధితురాలికి ఎస్సై నిన్న అందజేశారు.