CTR: బైరెడ్డిపల్లె మండలం నెల్లిపట్ల సమీప అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ దూడను చంపిన చిరుత ఇటీవల తరచూ పలువురు పశువుల కాపరుల కంటపడినట్లు చెబుతున్నారు. అడవిలోకి పశువులను మేతకు తీసుకెళ్లాలంటే భయపడుతున్నామన్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామాల వైపు చిరుత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.