కోనసీమ: ఆలమూరు మండలం పరిధిలోని బడుగువాని లంక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ పనులను శనివారం ఎంపీడీవో ఎ.రాజు పరిశీలించారు. గ్రామ ప్రజల రాకపోకలకు అనుకూలంగా, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించే లక్ష్యంతో ఈ కల్వర్ట్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.