BPT: యద్దనపూడి మండలం గన్నవరంలో రూ. 58 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో రూ. 94 లక్షలతో ‘జలసిరి’ పథకం కింద గ్రామంలోని 357 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు రంగయ్య చౌదరి బుధవారం తెలిపారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు.