కోనసీమ: జనసేన పార్టీ ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన ఘటనలో సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సంపత్ డిమాండ్ చేశారు. కె.గంగవరం మండలం బాలాంత్రంలో జనసేన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపి వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.