BPT: జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులను మూసివేయించారు.