KRNL: సి.బెళగల్ మండలం తిమ్మన్ దొడ్డి గ్రామం వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రిపగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెట్టే ఇసుకను కొందరు అక్రమంగా దోచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.