TPT: నారాయణవనం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం పూర్తైన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పదవీకాలంలో గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని తెలిపారు.