VSP: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందన్నారు. ఓఎంఆర్ షీట్లపై అవగాహన కోసం గంట ముందే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 44 కేంద్రాల్లో 14,689 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.