మార్కాపురం జిల్లా రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కనిగిరి మున్సిపల్ కార్మికులు ఇవాళ తెల్లవారుజాము నుంచే తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రిటైర్మెంట్, మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆప్కాస్లో చేర్చాలని, పెరిగిన వార్డులకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా నాయకులు PV.కేశవరావు పాల్గొన్నారు.