ATP: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు నుంచి పార్టీ బలోపేతం వరకు పలు అంశాలపై వీరు చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి వ్యూహాలపై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.