నంద్యాలలో ఏప్రిల్ 17,19 తేదీలలో జరగనున్న సీఐటీయు 17వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇవాళ నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సీఐటీయు నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నామని అన్నారు.