కోనసీమ: గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో Ex.Cm జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే వాలంటీర్స్ వ్యవస్థను పక్కన పెట్టిన ఈ ప్రభుత్వం, సచివాలయ వ్యవస్థను కూడా బలహీనపరుస్తున్నారన్నారు.